Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాస్తుశాస్త్రం: కార్తీక మాసంలో ఈ చెట్లను ఇంట్లో పెంచితే?

Tulasi
, శుక్రవారం, 28 అక్టోబరు 2022 (12:03 IST)
కార్తీక మాసంలో ఈ చెట్లను ఇంట్లో పెంచడం ప్రారంభించడం ద్వారా వాస్తు దోషాలు తొలగించుకోవచ్చు. తులసి మొక్కతో పాటు ఉమ్మెత్త పువ్వుకు సంబంధించిన చెట్లను ఇంట్లో పెంచుకోవచ్చు. ఉమ్మెత్త పువ్వుతో మాలను తయారు చేసి.. ఈశ్వరునికి సమర్పించిన వారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
ఉమ్మెత్త మొక్కలో శివుడు కొలువై వుంటాడని పురాణాలు చెప్తున్నాయి. ఇంట్లో మామూలు తులసి మొక్కతో పాటు విష్ణు తులసిని కూడా కార్తీక మాసంలో పెంచడం చేయవచ్చు. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందట. ఈ మొక్కలను పూజిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకేసారి పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. పితృదోషాలు కూడా తొలగిపోతాయి. 
 
కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు కొదువ వుండదు. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంటి ఎదురుగా పెంచుకోవడం ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఆ కుటుంబ పెద్ద ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. 
 
కార్తీక మాసంలో తులసి మొక్కను ఇంట ప్రతిష్టించడం మంచి ఫలితాలను ఇస్తుంది. శుభప్రదం అవుతుంది. నిత్యం దీపారాధన చేస్తూ తులసి చుట్టూ ప్రదక్షణలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని వాస్తు శాస్త్రం చెప్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగుల చవితి.. వేపచెట్టు, రావిచెట్టు కింద వుండే దేవతలను పూజిస్తే?