Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజూ రావి చెట్టు నీడన నిలబడితే.. ఏమౌతుంది..?

రోజూ రావి చెట్టు నీడన నిలబడితే.. ఏమౌతుంది..?
, మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (19:28 IST)
రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. విష్ణు స్వరూపంగా భావించే ఈ ఈ వృక్షాన్ని ఆశ్రయించడం వల్ల అభీష్టసిద్ది కలగడమే కాదు పాప నాశనమవుతుంది. ఈ చెట్టు మొదట్లో విష్ణువు, బోదేలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. 
 
ఇదిలా ఉండగా రావి చెట్టుని అశ్వత్థ వృక్షం, బోధి వృక్షం అని కూడా అంటారు. సిద్ధార్థుడికి జ్ఞానోద‌యమై బుద్ధుడిగా మారాడు. అందుకే దీనిని బోధివృక్షం అంటారు.
 
రావి చెట్టు విష్ణు స్వరూపం, వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తారు. అలానే ఈ వృక్షాలని పూజించడం వలన దాంపత్య దోషాలు తొలగిపోతాయి. 
 
భార్య భర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు అంటున్నారు. ఈ చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రోజూ రావి చెట్టు నీడన నిలబడితే శని దోషం తొలగిపోతుంది. అలాగే రోజూ రావి చెట్టుకు ఓ చెంబుడు నీళ్లు పోయడం ద్వారా అభీష్టాలన్నీ నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-04-2021 మంగళవారం దినఫలాలు - హనుమంతుని ఆరాధించడం వల్ల..