Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్షయ తృతీయ: బంగారం కంటే ఉప్పు కొనడం చాలు...

sea salt
, మంగళవారం, 3 మే 2022 (09:46 IST)
అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి ఆభరణాలు కొనడం వల్ల జీవితంలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వేదకాలంలో ఋషులు అక్షయ తృతీయ నాడు యజ్ఞయాగాదులు, పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందారు. అందుకే అక్షయ తృతీయ రోజున వీలైనంత పూజలు, దానధర్మాలు చేయడం.. సన్మార్గంలో నడవాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
 
అక్షయ తృతీయ రోజున ప్రారంభించిన ఏ కార్యమైనా.. పలు రెట్లు శుభఫలితాలను ఇస్తుంది. అక్షయ తృతీయ రోజున చేసే పూజల ఫలాలు అనేక రెట్లు పెరుగుతాయి. అక్షయ తృతీయ నాడు దానం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. 
 
పశువులకు ఆహారాన్ని అందించడం వల్ల జీవితంలో సౌభాగ్యం పెరుగుతుంది. బంగారం, వెండిని కొనుగోలు చేయడం కూడా ఉత్తమం. అలాగే బంగారం కొనడం కంటే ఉప్పు లేదా పసుపును కొనుగోలు చేస్తే, ప్రయోజనం బంగారం కొనడం కంటే ఎక్కువని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-05-22 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల...