బుల్లితెరపై గతంలో ప్రసారం అవుతున్న మాయల మరాఠీ జానపద పౌరాణిక మెగా సీరియల్ దాదాపు 70 ఎపిసోడ్ల తర్వాత అనివార్య కారణాలతో నిలిచిపోయింది. తర్వాత అది ప్రసారం కాలేదు. అయితే ఓరుగంటి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఈ సీరియల్ను తిరిగి ప్రసారం చేయాలని సంకల్పించారు.
దీంతో 2000 సంవత్సరం జెమినీ టీవీలో నిలిచిపోయిన ఈ సీరియల్ త్వరలో తిరిగి ప్రసారానికి సిద్ధం కానుంది. ఓరుగంటి టెలిఫిలింస్ పతాకంపై ఓరుగంటి గోవిందరావు సమర్పణలో ముళ్లపూడి సూర్యచంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సీరీయల్కు సంబంధించిన షూటింగ్ బుధవారం బూత్ బంగ్లాలో ప్రారంభమయింది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ సీరియల్లో బాలవర్ధి పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తానని చెప్పాడని.. అయితే కొన్ని కారణాల వల్ల సద్వినియోగం చేసుకోలేకపోయామని ప్రస్తుత తారాగణంతో ముందుకు సాగుతున్నాం అని చెప్పారు.
కథారచయిత గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ సుమారు నాలుగువందల ఏళ్ల నాటి క్రితం నేటి రాయలసీమ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనను సీరియల్గా గతంలో ప్రసారం చేశాము.. దాని కొనసాగింపుగా సుమారు వంద ఎపిసోడ్స్గా ఈ సీరియల్ను మలుస్తున్నట్లు తెలిపారు.
ఈ సీరియల్లో మాయలమరాఠీగా ఖమ్మం జిల్లా రంగస్థల నటుడు ఆర్ వెంకటేశ్వరరావు పోషిస్తుండగా, కాపాలి పాత్రను పొట్టి వీరయ్య పోషిస్తున్నారు. సంగు పాత్రను అరుణ పోషిస్తుండగా, బాబుమోహన్, జేవీ రమణమూర్తి, గుండు హనుమంతరావు, గౌతం రాజు, చిట్టి బాబులు మిగిలిన పాత్రల్లో నటిస్తున్నారు.