Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంటీవీ 'రోడీస్' షోను ప్రారంభించిన అక్షయ్

Advertiesment
ఎంటీవీ రోడీస్ షో ప్రారంభం అక్షయ్ ఆశీష్ ప్రైజ్మనీ ప్రసారం రియాల్టీ షో
ప్రముఖ మ్యూజిక్ ఛానెల్ ఎంటీవీకి చెందిన కొత్త అడ్వెంచర్ రియాల్టీ షో 'రోడీస్'ను హిందీ సినీ నటుడు అక్షయ్ కుమార్ ప్రారంభించారు. ఈ షో (కమాండో అబ్‌స్టాకిల్) తొలి విభాగంలో పాల్గొనడానికి సుమారు 20 మందికి పైగా పోటీదారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం జనవరి 10 శనివారం రాత్రి 7 గంటలకు ఎంటీవీలో ప్రసారమవుతుంది. ఎంటీవీ ఇండియా జనరల్ మేనేజర్ మరియు ఉపాధ్యక్షుడు ఆశీష్ పాటిల్ మాట్లాడుతూ, క్రిందటి ఏడాది తాము నిర్వహించిన హీరో హోండా రోడీస్-హెల్ డౌన్ అండర్ షో పిల్లల చిత్రంలా ఎంతో ఆసక్తిని రేకెత్తించేదిగా సాగిందని తెలిపారు.

తాజాగా అక్షయ్‌చే భారీ ఎత్తున తాము ప్రారంభించిన ఈ షో ఈ సీజన్‌లో అతి పెద్ద హిట్టవుతుందన్నారు. అలాగే గత షో కన్నా ఈ షోకు రెండు రెట్లు అధిక ప్రైజ్‌మనీని అందించనున్నట్లు ఆశిష్ తెలిపారు. ఇందులో పాల్గొంటున్న పోటీదారులు న్యూఢిల్లీ నుంచి ఉదయ్‌పూర్, అహ్మదాబాద్, సిల్వసా వంటి నగరాలకు ప్రయాణిస్తారని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu