బాంబే, ఒకేఒక్కడు చిత్రాల ద్వారా తెలుగు చిత్ర సీమకు సైతం పరిచయమైన బాలివుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ప్రస్తుతం రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
నేపాల్ రాజకీయాల్లో ప్రవేశించనున్నట్టు తాజాగా నేపాల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె తాత బి.పి కోయిరాలా నేపాల్కు ఎన్నికైన తొలి ప్రధాని కాగా, ప్రస్తుత ప్రధాని గిరిజా ప్రసాద్ కోయిరాలా కూడా ఆమెకు బంధువు కావడం గమనార్హం. ఆమె తండ్రి ప్రకాష్ కోయిరాలా కూడా కొంతకాలం నేపాల్ మంత్రిగా పనిచేశారు.