Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆజ్ తక్ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ సర్దానా కరోనాతో కన్నుమూత

ఆజ్ తక్ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ సర్దానా కరోనాతో కన్నుమూత
, శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (14:29 IST)
ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్, జర్నలిస్ట్ రోహిత్ సర్దానా శుక్రవారం కన్నుమూశారు. రోహిత్ సర్దానా దాదాపు వారం క్రితం కరోనావైరస్ బారిన పడ్డారు. ఆయన మెట్రో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఐతే శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది.
 
జీ నెట్‌వర్క్ నుండి తన మాజీ సహోద్యోగి సుధీర్ చౌదరితో సహా పలువురు జర్నలిస్టులు తన జర్నలిస్ట్ ఆకస్మిక మరణం గురించి సమాచారాన్ని ట్వీట్ చేశారు. టీవీ టుడే సంస్థలో సర్దానా ప్రస్తుత సహోద్యోగి కూడా టీవీ యాంకర్ మరణానికి సంతాపం తెలిపారు.
 
ఏప్రిల్ 24న రోహిత్ స్వయంగా కరోనావైరస్ బారిన పడినట్లు ట్వీట్ చేశాడు. గుండెపోటుతో ఈ ఉదయం ఆయన కన్నుమూసినట్లు సమాచారం. నిర్భయమైన విధానం, విభిన్న స్వర శైలికి ప్రసిద్ది చెందిన సర్దానా జీ నెట్‌వర్క్‌లో 'తాల్ తోక్ కే', ఆజ్ తక్‌లోని 'దంగల్' వంటి ప్రైమ్-టైమ్ టీవీ షోలను నిర్వహించారు.
 
ఆయన 2018 గణేష్ విద్యార్థి పురస్కార్ అవార్డు గ్రహీత కూడా. టీవీ యాంకర్ ఆకస్మిక మరణంతో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, రోహిత్ మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయనను "ఓ బలమైన, సూటిగా ప్రశ్నించే జర్నలిస్ట్" అని అభివర్ణించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోంఐసొలేషన్‌లో ఎలాంటి మందులు వాడాలి?