Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం సీసాలో తేలు: పుల్లలచెరువు మద్యం షాపులో ఘటన

Advertiesment
Scorpion
, శుక్రవారం, 25 జూన్ 2021 (15:44 IST)
పుల్లలచెరువు ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన పుల్లలచెరువు లోని ప్రభుత్య మద్యంషాపులో గురువారం కొందరు మద్యంప్రియులు "మ్యాన్షన్ హౌస్" బాటిళ్లను కొనుగోలు చేశారు. గ్లాసులు, నీళ్లు, స్టఫ్ తీసుకుని తాగేందుకు సమాయత్తమయ్యారు.

తీరా మందుబాటిల్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా అందులో విషాపురుగైన తేలు ( వృచ్చికం) కనిపించింది. దీంతో సదరు మందుబాబులు అవాక్కయ్యారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాధారణంగా కల్తీ మందును చూస్తుంటాం, చెత్తమందును చూసుంటాం, చెత్త బ్రాండులను చూస్తుంటాం. అయితే ఇలా విషపుగులు వుండటమేమిటని ప్రశ్నిస్తున్నారు.

రూ.150, 200 లకు "స్పెషల్ స్టేటస్", "గోల్డ్ మెడల్" , "ప్రషిడెంట్ మెడల్" వస్తున్నాయి కానీ ఇలా విషపురుగు లతో మద్యం బాటిళ్లు సీల్‌తో సహా రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సంబందిత అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టి, తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనంద్ మహీంద్రా ఫన్నీ వీడియో వైరల్.. థ్రిల్ కావాలంటే క్లిప్ చివరి వరకూ చూడండి