Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సేమ్ సీన్' రిపీట్... లోక్‌సభ 37 సెకన్లకే... రాజ్యసభ రేపటికి వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు మరోమారువాయిదా పడ్డాయి. ప్రధాని మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైకాపా పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలంటూ ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కాన

'సేమ్ సీన్' రిపీట్... లోక్‌సభ 37 సెకన్లకే... రాజ్యసభ రేపటికి వాయిదా
, బుధవారం, 21 మార్చి 2018 (11:33 IST)
పార్లమెంట్ ఉభయ సభలు మరోమారువాయిదా పడ్డాయి. ప్రధాని మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైకాపా పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలంటూ ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఉభయ సభల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. 
 
దీనికి కారణంలేకపోలేదు. కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల పెంపుపై తెరాస ఎంపీలు ఆందోళనలకు దిగాయి. ఈ రెండు పార్టీలు వెల్‌లోకి దూసుకొచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో సభలో రభస చోటుచేసుకుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత వారించినా విపక్షాలు వినకపోవడంతో ఆమె సభ ప్రారంభమైన 37 సెకన్లకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
 
మరోవైపు రాజ్యసభలోనూ ఇదే సీను చోటుచేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం సభలో విపక్ష అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌లు అందోళనలు చేపట్టాయి. సభా సజావుగా ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలించలేదంటూ రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభను ఏకంగా గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. దీంతో తమ తదుపరి కార్యాచరణపై విపక్షాలు దృష్టి సారిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా దేవాన్ష్ పుట్టినరోజు .. శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ (వీడియో)