Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రయీస్ ప్రమోషన్: రైలులో సన్నీలియోన్.. రెచ్చిపోయిన ఫ్యాన్స్.. కిటికీపై కొడుతూ.. చప్పుడు చేస్తూ?

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన షారూఖ్ ఖాన్ మూవీ రయీస్ ప్రమోషన్లో భాగంగా సెంట్రల్ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే అగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్‌లో షారుఖ్, సన్నీలతో పాటు చిత్ర యూనిట్ బయలుదేరారు. రైలు ఎక్కే సమయంల

రయీస్ ప్రమోషన్: రైలులో సన్నీలియోన్.. రెచ్చిపోయిన ఫ్యాన్స్.. కిటికీపై కొడుతూ.. చప్పుడు చేస్తూ?
, మంగళవారం, 24 జనవరి 2017 (11:00 IST)
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన షారూఖ్ ఖాన్ మూవీ రయీస్ ప్రమోషన్లో భాగంగా సెంట్రల్ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే అగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్‌లో షారుఖ్, సన్నీలతో పాటు చిత్ర యూనిట్ బయలుదేరారు. రైలు ఎక్కే సమయంలో సన్నీ లియోన్ బుర్కా ధరించి ఎక్కింది. ఇంజిన్ మార్పిడి కోసం గుజరాత్‌లోని వడోదరలో రైలును కాసేపు ఆపారు. అప్పటికే పలు మాధ్యమాల ద్వారా వీరంతా రైలులో వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, భారీ సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్నారు. 
 
రైలులో ఉన్న బాలీవుడ్ శృంగార నటి సన్నీలియోన్‌ను చూసి ఆమె ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమె కూర్చున్న బోగీని వందలాది మంది చుట్టుముట్టారు. కిటికీపై కొడుతూ, చప్పుడు చేశారు. అభిమానుల తొక్కిసలాటను చూసిన సన్నీ నిశ్చేష్టురాలైంది. ఆ తర్వాత విండో కర్టెన్ మూసేసింది. అయినా సరే ఆగని అభిమానులు కిటికీని కొడుతూనే ఉన్నారు. గుజరాత్‌‍లోని వడోదర స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. షారుఖ్ ఖాన్ ది కూడా ఇదే పరిస్థితి. చివరకు, పోలీసులు రంగ్ర ప్రవేశం చేసి, లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో వడోదర స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'రాయీస్' చిత్ర ప్రమోషన్‌లో విషాదం... వడోదర స్టేషన్‌లో తొక్కిసలాట