Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడు ధ్వజారోహణం

Advertiesment
తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడు ధ్వజారోహణం
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2011 (14:30 IST)
శ్రీవారి బ్రహ్మోత్సావాల్లో భాగంగా గురువారం ధ్వజారోహణ ఉత్సవం నిర్వహిస్తారు. "న భూతో న భవిష్యతి" అనేలా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులనూ ఆహ్వానిస్తారు. స్వామి వాహనం గరుడుడు కాబట్టి, కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని 'గరుడ ధ్వజ పటం' అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు.

ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీనలగ్నంలో కొడితాడుకు కట్టి, పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఆహ్వాన పత్రం.

ఈ ఆహ్వానంతో ముక్కోటి దేవతలూ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉండి, ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి అరుదైన వేడుక గురువారం సాయంత్రం నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu