Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మోత్సవాలు... మోహినీ అవతారంలో పరమార్థం ఏమిటి?(video)

బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు ఉదయం వేంకటేశ్వర స్వామి మోహినీ రూపంలో దంతుల పల్లకిలో తిరుమాడా వీధులలో విహరించారు. హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీ ఒంటరిగా విహారానికి రాదు కాబట్టి మోహినీ రూపంలోని స్వామి వెంట శ్రీకృష్ణస్వామి మరో పల్లకిపై వచ్చారు. ఉత్సవమూర్తి నిల్

బ్రహ్మోత్సవాలు... మోహినీ అవతారంలో పరమార్థం ఏమిటి?(video)
, శుక్రవారం, 7 అక్టోబరు 2016 (18:23 IST)
బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు ఉదయం వేంకటేశ్వర స్వామి మోహినీ రూపంలో దంతుల పల్లకిలో తిరుమాడా వీధులలో విహరించారు. హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీ ఒంటరిగా విహారానికి రాదు కాబట్టి మోహినీ రూపంలోని స్వామి వెంట శ్రీకృష్ణస్వామి మరో పల్లకిపై వచ్చారు. ఉత్సవమూర్తి నిల్చున్న భంగిమలో కాకుండా దంతపు పల్లకిలో ఆశీనులై కనిపించారు. స్త్రీలు ధరించే అన్ని రకాల ఆభరణాలను స్వామివారికి అలంకరించారు.


వరదభంగిమలో కనిపించే స్వామివారి కుడిహస్తం మోహినీ రూపంలో అభయహస్త ముద్రతో ఉంటుంది. స్వామివారికి పట్టుచీర కీరిటంపైన రత్న, ఖచితమైన సూర్యచంద్ర సావేరి, నాశికకు వజ్రఖచిత ముక్కుపుడక, బులాకి, శుంఖుచక్ర స్థానాల్లో రెండు వికసించిన స్వర్ణకమలాలు ఉన్నాయి.
 
బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలన్నీ వాహనమండపం నుండి తిరుమాఢా వీధుల్లో తిరిగితే... మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది. బలగర్వితులు, అహాంకారులు కార్యఫలితాన్ని పొందలేరని, వినయవిధేయతలతో భగవంతుడిని ఆశ్రయించినవారే ముక్తిసోపనాలను పొందగలరని ఈ వాహనసేవలోని పరమార్థం. 
 
సమస్త జగత్తు తన మాయలోనే ఉందని తనను ఆశ్రయించిన భక్తులు మాత్రమే మాయను జయించి తనను చేకొగలరని మోహినీ రూపంలో స్వామివారు సందేశమిస్తున్నారు. దేవదేవుడకి జరిగే వాహన సేవలన్నిటిలోనూ అలంకరణాలు మారినప్పటికి మోహినీ అవతారంలో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు జరగవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమలా పళ్లు వచ్చేశాయ్... ఈ పండ్లు తింటే ఉపయోగాలేంటో తెలుసా...?!