ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగే అద్భుతమైన దృశ్యాన్ని శ్రీవారి భక్తులు తిలకించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి స్వామివారు శారదా రూపంలో హంస వాహనంపై ఊరేగారు.
పాలు, నీళ్లు వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా మలయప్ప స్వామి ఈ వాహనంపై అధిరోహించారు. చదువుల తల్లి అవతారంలో స్వామివారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగే దివ్య దృశ్యాన్ని భక్తులు కనులారా వీక్షించారు.