Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మోహిని' అవతారంలో శ్రీనివాసుడు

Advertiesment
'మోహిని' అవతారంలో శ్రీనివాసుడు
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఉదయం కలియుగదైవం శ్రీనివాసుడు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మోహినిని బంగారపు చీర, సూర్య - చంద్ర హారాలు, రత్న కిరీటాలు, కర్ణ పత్రాలు వీటితో పాటు వజ్రపు ముక్కుపుడకతో అలంకరిస్తారు. శ్రీక్రిష్ణుడి తోపాటు మోహినిని కూడ పల్లకీలో ఊరేగిస్తారు.

ఒక్క బ్రహ్మోత్సవంలో మాత్రమే మనం ఈ మోహినీ అవతారంలో చూడొచ్చు. ఈ అవతారంలో స్వామి వారు మనకి వరద హస్తం నుంచి అభయ హస్తం చూపిస్తారు. అన్ని అవతారంలో కల్ల అయిదవ రోజు రాత్రి వచ్చే "గరుడ సేవ" ఈ బ్రహ్మోతసవాల్లో ప్రాముఖ్య మైనది.

ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అరుదుగా వుండే లక్ష్మీ హారం, మకర-కంటి మరియు సహస్త్ర నామ హారం ధరించి గరుడ మీద తిరువీధుల్లో ఊరేగిస్తారు. మన పురాణాల ప్రకారం గరుడ అంటే పక్షి రాజు (వేదాలకు ప్రతిరూపం). అందుకే స్వామి ఆ రోజు ఆయనను గరుడలో చూసుకుంటాడు.

అందుకే గరుడ సేవకి అంత ప్రాముఖ్యత ఉంది. వైష్ణవ పురాణాల్లో గరుడని "పెరియతిరువాది" అని పిలుస్తారు. అంటే "ప్రధమ భక్తుడు" అని అర్థం. అన్ని వాహనాల్లో గరుడ వాహనం చాల గొప్పది. అందుకే ఈ మోహిని వాహనాన్ని అత్యంత వేడుకగా చేశారు. మోహిని వాహనం సందర్భంగా తిరుమల గిరులు గోవింద నామ స్మరణతో మార్మోగి పోయాయి.

Share this Story:

Follow Webdunia telugu