Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను స్లో అయ్యనా?: రామ్ గోపాల్ వర్మ కొత్త సందేహం

నేను స్లో అయ్యనా?: రామ్ గోపాల్ వర్మ కొత్త సందేహం
, సోమవారం, 9 మార్చి 2020 (16:14 IST)
అనుశ్రీ సమర్పణలో ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ & జేకే క్రియేషన్స్ బ్యానర్ లో జీడీ.కాశీo నిర్మాతగా జేడీ.చక్రవర్తి, జెనర్జీ, అక్షత, మనోజ్ నందన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఎంఎంఓఎఫ్.

ఈ చిత్ర ట్రైలర్ కార్యక్రమం హైదరాబాద్ లో సోమవారం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...ఎంఎంఓఎఫ్ ట్రైలర్ చూశాక నేను స్లో అయ్యనా సినిమా తీసిన వారు ఫాస్ట్ గా ఉన్నారా అనే అనుమానం కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉంది, ఆడియన్స్ కు సినిమా చూడాలి అనిపించేలా ఉంది.

ఈ సినిమా యూనిట్ సభ్యులు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. జేడీ చక్రవర్తి ఇలాంటి కొత్త కాన్సెప్ట్ మూవీస్ మరెన్నో చెయ్యలని కోరుకుంటున్న అన్నారు. 
 
నటుడు బెనర్జీ మాట్లాడుతూ...జేడీ కాల్ చేసి ఈ సినిమా చెయ్యమని అడిగారు, మంచి పాత్ర,  కథ కథనాలు బాగున్నాయని సినిమా చేశాను. జేడీతో చాలా కాలం తరువాత కలిసి నటించాను.

ఈ సినిమా ట్రైలర్ ఆర్జీవి చేతుల మీద విడుదల అవ్వడం సంతోషం. ఆర్జీవితో నాకు ఎంతో కాలం నుండి పరిచయం ఉంది, దాదాపు ఆయన అన్ని సినిమాల్లో నటించాను.

తెలుగు సినిమాకు డిఫరెంట్ మేకింగ్ ను పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ఎంఎంఓఎఫ్ సినిమా కొత్త కాన్సెప్ట్ తో వస్తోంది, ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని భవిస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్నారు. 
 
హీరో మనోజ్ నందం మాట్లాడుతూ...మా సినిమా ట్రైలర్ ఆర్జీవి గారు విడుదల చెయ్యడం గుడ్ సైన్. ఈ సినిమాలో జేడీ గారితో నటించడం మర్చిపోలేని అనుభూతి. ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రతో మీ ముందుకు వస్తున్నాను. మా ఎంఎంఓఎఫ్ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని తెలిపారు.
 
శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ...వర్మ లా సినిమాలు చెయ్యాలని అతన్ని అనుకరించాలని చాలా మంది అనుకుంటారు కానీ అది అసాధ్యం. జీడీ చక్రవర్తి మేధాసంపత్తు ఉన్న నటుడు, ఎంఎంఓఎఫ్ ట్రైలర్ కొత్తగా ఉంది, ఆసక్తిని కలిగించింది. త్వరగా సినిమా చూడాలని అనిపిస్తుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయన ఏం చేయమన్నా చేస్తా... రెజీనా కెసాండ్రా