మార్చికి 'కార్తికేయ' సిద్ధం: స్వామిరారా తర్వాత...?
, సోమవారం, 3 ఫిబ్రవరి 2014 (17:11 IST)
ప్రేమ, వినోదంతో కొత్త కోణంలో ఆవిష్కరించిన 'స్వామిరారా' చిత్రం తర్వాత నిఖిల్ సిద్దార్థ్, స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం 'కార్తికేయ'. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఓవర్సీస్ పంపిణీహక్కులను 'మాడ్' అనే సంస్థ చేజిక్కించుకుంది.స్వామిరారా... చిత్రానికి ప్రేక్షకులనుంచి స్పందనరీత్యా ఈ చిత్రాన్ని తాము తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రాన్ని చందూ మండేటి నిర్మించగా, వెంకట్ శ్రీనివాస్ బొగ్గారం దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.