జూన్ 3న 'శివకేశవ్' విడుదల
, సోమవారం, 27 మే 2013 (14:53 IST)
భానుచందర్ తనయుడు జయంత్ యువ కథానాయకుడిగా శ్రీహరి, గుర్లిన్ చోప్రా, సంజన, శ్వేతాబసుప్రసాద్, ఖుషీశర్మ ముఖ్య తారాగణంగా సీతారామ ఫిలింస్ పతాకంపై నాగరాజు బానూరి (జడ్చర్ల) నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'శివకేశవ్'. ప్రముఖ నటుడు కుమారుడు పరిచయమవుతున్న ఈ చిత్రానికి ఆర్.వి.సుబ్రహ్మణ్యం దర్శత్వం వహిస్తున్నారు. శ్రీహరి సరసన గుర్లిన్ చోప్రా, జయంత్కు జంటగా సంజన నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నాగబాబు, యం.యస్.నారాయణ, కృష్ణభగవాన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 'సుడిగాడు' ఫేమ్ శ్రీవసంత్ సంగీత సారధ్యం వహిస్తుస్తున్న ఈ చిత్రం ఆడియో జూన్ 3న విడుదల కానుంది. పాటలు సహా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ సైతం దాదాపుగా పూర్తి చేసుకుంది. ఆడియో విడుదల పురస్కరించుకుని చిత్ర నిర్మాత నాగరాజు బానూరి (జడ్చర్ల) మాట్లాడుతూ.. ' లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'శివకేశవ్' చిత్రం పాటలు సహా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. 'సుడిగాడు' ఫేమ్ శ్రీవసంత్ అద్భుతమైన బాణీలిచ్చాడు. ఆర్.ఆర్.కూడా చాలా బాగా వస్తోంది. జూన్ 3న ఆడియో విడుదల చేసి, జూన్ నెలాఖరుకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 'శివకేశవ్'.. రియల్స్టార్ డా||శ్రీహరి కెరీర్లో గర్వంగా చెప్పుకునే చిత్రమవుతుంది. యువ హీరోగా పరిచయమవుతున్న భానుచందర్ కుమారుడు జయంత్కు కూడా చాలా మంచి పేరొస్తుంది' అన్నారు.