పదకవితా పితామహుడు అన్నమయ్య సంకీర్తనల మాధుర్యంలో విశాఖపట్టణ సాగర తీరం పులకించిపోయింది. సాయంత్రం వేళ వేయి మంది కళాకారుల పాల్గొన్న ఈ సమ్మేళనంలో నాడు అన్నమయ్య వేంకటేశ్వరునికి అర్చించిన ఎన్నో గీతాలను ఆలపించారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని కీర్తిస్తూ నాడు అన్నమయ్య ఆలపించిన గీతాలను ఎంతో శ్రావ్యంగా ఆలపించారు కళాకారులు. విశాఖ సాగరతీర అందాలను వీక్షించటానికి వచ్చినవారికి అన్నమయ్య సంకీర్తనలు మంత్రముగ్ధులను చేశాయి. ఆ ఆనందపు క్షణాలను వీడియోలో మీరూ వీక్షించండి.