Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంస్కృతం- ప్రాక్రిత్‌ స్టడీస్‌ ప్రోత్సాహానికి మూర్తి ట్రస్ట్‌ 75 మిలియన్ రూపాయలు

Sudhamurti
, మంగళవారం, 13 డిశెంబరు 2022 (16:04 IST)
శ్రీమతి సుధామూర్తి, శ్రీ నారాయణ మూర్తిల కుటుంబ ఫౌండేషన్‌, మూర్తి ట్రస్ట్‌ తాము సంస్కృతం మరియు ప్రాక్రిత్‌లో అత్యంత అరుదైన పుస్తకాలు మరియు  రాతప్రతులను కాపాడటంతో పాటుగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు 75 మిలియన్‌ రూపాయలను భండార్కర్‌ ఓరియెంటల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (బీఓఆర్‌ఐ)కు అందించనున్నట్లు వెల్లడించింది. ఈ గ్రాంట్‌లో భాగంగా 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వారసత్వ శైలిలో మూర్తి సెంటర్‌ ఆఫ్‌ ఇండియాక్‌ స్టడీస్‌ నిర్మాణం చేపట్టడంతో పాటుగా 200 సీట్ల క్లాస్‌రూమ్‌ సీటింగ్‌ సామర్ధ్యంతో విద్య మరియు పరిశోధనల భవంతి, ఉపన్యాసాలను జరిపేందుకు అత్యాధునికమైన ఆడిటోరియం,  ఆడియో-వీడియో స్టూడియోను పురాతన పుస్తకాలు, రాత ప్రతులను డిజిటలీకరించడం నిర్మించడం కోసం వినియోగించనున్నారు. ఈ భవంతి కోసం భూమిపూజను నిర్వహించారు. శ్రీమతి సుధామూర్తి ఈ భవంతి నిర్మాణం కోసం పునాది రాయి వేశారు.

 
ఈ నూతన కార్యక్రమం గురించి శ్రీమతి సుధామూర్తి మాట్లాడుతూ, ‘‘బీఓఆర్‌ఐ 105 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ముఖ్యమైన మూలస్థంభం ఇది. ఇది అపూర్వమైన మేధోపరమైన పరిశోధనా పత్రాలు మరియు పుస్తకాలను వెలుగులోకి తీసుకువచ్చింది. బీఓఆర్‌ఐ వద్ద ప్రతి ప్రొఫెసర్‌ ఓ స్కాలర్‌. రెండు పుస్తకాలు, క్రిటికల్‌ ఎడిషన్‌ ఆఫ్‌ మహాభారత మరియు కానె యొక్క ధర్మ శాస్త్ర  పట్ల నేను ఆశ్చర్యపోయాను. ఈ రెండూ కూడా నా మనసుకు నచ్చిన పుస్తకాలు. కాలం మారుతున్న వేళ, ఎక్కువమంది ఆన్‌లైన్‌ తరగతులను మన సంస్కృతి గురించి మరింతగా తెలుసుకునేందుకు  కోరుకుంటున్నారు. అలాగే స్టాఫ్‌తో మాట్లాడేందుకూ ఈ మాధ్యమం వినియోగించాలనుకుంటున్నారు. అందువల్ల, మూర్తి ట్రస్ట్‌ ఇప్పుడు బీఓఆర్‌ఐకు మద్దతు అందించాలనుకుంటుంది. ఈ నూతన మరియు అధునాతన భవంతిని భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని వేడుక చేసేందుకు అంకితం చేశాము’’అని అన్నారు.

 
బీఓఆర్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ శ్రీ భూపాల్‌ పట్వార్థన్‌ ఈ ఇనిస్టిట్యూషన్‌ ప్రణాళికలను మూర్తి సెంటర్‌ ఆఫ్‌ ఇండియాక్‌ స్టడీస్‌ గురించి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ‘‘గౌరవనీయ సుధామూర్తిగారు విద్యా ప్రాజెక్టులను గురించి నిధులను అందించారు. ఇప్పుడు ఈ ఇనిస్టిట్యూట్‌లో దాదాపు 40 మంది స్కాలర్స్‌ విభిన్నమైన అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. వాటిలో భారతీయ ఫిలాసఫీ నుంచి కథక్‌ మరియు ఆయుర్వేద మొదలు ఆస్ట్రానమీ వరకూ ఉన్నాయి. త్వరలో రానున్న మూర్తి సెంటర్‌ ఆఫ్‌ ఇండియాక్‌ స్టడీస్‌ ఇప్పుడు 60 మందికి పైగా స్కాలర్స్‌కు తగిన వసతులు అందించనుంది. అదే సమయంలో ఈ ఇనిస్టిట్యూట్‌ ఇప్పుడు విద్యా రంగంలో కూడా అడుగు పెడుతుంది.

 
ఇప్పుడు నిర్మించబోయే తరగతి గదులు 200 మంది విద్యార్థులు విభిన్నమైన కోర్సులు అభ్యసించేందుకు తగిన సౌకర్యాలు అందించనున్నాయి. ఈ మూర్తి సెంటర్‌లో ఓ స్టూడియో సైతం ఉంటుంది. చక్కటి ఆన్‌లైన్‌ కంటెంట్‌ను సైతం మేము సృష్టించనున్నాము. దీనిని  మా ప్లాట్‌ఫామ్‌ భారత్‌ విద్యపై అందించనున్నాము. ఈ ఇనిస్టిట్యూట్‌లో 28 వేల రాత ప్రతులు, పాత పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలకు తగిన మద్దతు అందించేందకు ఈ నూతన భవంతిలో సంప్రదాయ లైబ్రరీ సైతం అందుబాటులో ఉంటుంది. ఇనిస్టిట్యూట్‌ ప్రయాణంలో అతి పెద్ద మైలురాయిగా ఇది నిలువనుంది. ఈ సదుపాయంతో, ఇండియాక్‌ సంస్కృతి నుంచి విభిన్నమైన బోధనాంశాలను ప్రపంచవ్యాప్తంగా బోధించనున్నాము. మూర్తి ట్రస్ట్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జికా వైరస్ అలెర్ట్.. దోమకాటుకు దూరంగా వుండండి.. కండోమ్స్ వాడాల్సిందే..