Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగుభాష సంస్కృతి చైతన్య యాత్ర

Advertiesment
ఇతరాలు సాహిత్యం కళలు మరియు సంస్కృతి తెలుగుభాష సంస్కృతి చైతన్య యాత్ర తెలుగు కవులు కళాకారులు తెలుగుభాషాభిమానులు పాత్రికేయులు
తెలుగు కవులు, కళాకారులు, తెలుగుభాషాభిమానులు, పాత్రికేయులు తదితర ప్రముఖులతో ఈ నెల 21 నుంచి 24వరకు తెలుగుభాష సంస్కృతి చైతన్య యాత్ర వైభవంగా జరుగనుంది. పత్రికా సంపాదకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు స్వర్గీయ నార్ల వెంకటేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఈ చైతన్య యాత్రను చేపడుతున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు, హిందీ భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను, సంస్కృతిక కాపాడుకునేందుకు లోక్ నాయక్ ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేపడుందని చెప్పారు.

నార్ల వెంకటేశ్వరరావు స్వగ్రామమైన కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని కౌతవరం నుంచి ఈ నెల 21న ఈ యాత్రను ప్రారంభిస్తామని ఆయన వివరాలందించారు. భీమవరం నుంచి రాజమండ్రి, కాకినాడ, తుని, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు ఈ చైతన్య యాత్ర సాగుతుందని లక్ష్మీప్రసాద్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu