Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ.. పెళ్లి.. పేరుతో రూ.2కోట్లు గుంజేశాడు.. యూట్యూబర్ హర్షపై కేసు

Harsha Sai

సెల్వి

, మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (21:23 IST)
Harsha Sai
ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, దాతృత్వ వీడియోలకు పేరుగాంచిన హర్ష సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మహిళను పెళ్లి చేసుకుంటాననే నెపంతో మోసం చేసి రూ.2కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణల కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఒక టెలివిజన్ షోలో పాల్గొన్న మహిళ, తాను ఒక పార్టీలో హర్ష సాయిని కలిశానని, వివిధ అసైన్‌మెంట్‌లలో కలిసి పనిచేస్తున్నప్పుడు వారి మధ్య స్నేహం ఏర్పడిందని ఫిర్యాదు చేసింది. 
 
బిగ్ బాస్ మిత్రా శర్మగా గుర్తించబడిన మహిళ, హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, బదులుగా తనకు రూ. 2 కోట్లు ఇవ్వాలన్నాడు. అయితే మోసపోయానని గ్రహించి.. తన లాయర్‌తో కలిసి ఫిర్యాదు చేయడానికి నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.
 
ఇందులో హర్ష సాయి తండ్రి రాధా కృష్ణ కూడా చిక్కాడు. మిత్రా శర్మ తన ప్రకటనలో, హర్ష సాయి వివాహ వాగ్దానాలతో తన నమ్మకాన్ని ఎలా పొందాడో.. ఆ నమ్మకాన్ని ఆర్థిక లాభం కోసం ఎలా ఉపయోగించుకున్నాడో వివరించింది. 
 
ధార్మిక కార్యక్రమాలను హైలైట్ చేసే వీడియోల కోసం హర్ష సాయి తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో సుపరిచితుడు. ప్రస్తుతం, అతను మిత్ర శర్మ కథానాయికగా నటించిన "మెగా" అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది. నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జానీ మాస్టర్ కి జరిగింది రేపు వారికీ జరుగుద్ది : సుహాసిని కామెంట్