Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా సినిమా బయటకు వస్తుందో రాదో ఎవడికి తెలుసు? తన చిత్రంపై వినాయక్ సెటైర్

నా సినిమా బయటకు వస్తుందో రాదో ఎవడికి తెలుసు? తన చిత్రంపై వినాయక్ సెటైర్
, శనివారం, 31 అక్టోబరు 2020 (20:07 IST)
మాస్ సినిమా అనగానే... ఈ కాలంలో గుర్తుకువచ్చే డైరెక్టర్ వి.వి.వినాయక్. అభిరుచి గల నిర్మాత రాజును దిల్ సినిమాతో దిల్ రాజు చేసేసారు. అప్పటి నుంచి నిర్మాత దిల్ రాజు - దర్శకుడు వినాయక్ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే... ఎందుకు అనిపించిందో ఏమో కానీ... వినాయక్‌ని హీరోగా పెట్టి సినిమా తీయాలనిపించింది దిల్ రాజుకు.
 
అంతే... వినాయక్‌కి ఓ రోజు ఈ విషయం చెప్పడం... వినాయక్ కూడా ఓకే అనడం జరిగింది. అంతేనా... శీనయ్య అనే టైటిల్‌తో సినిమాని గ్రాండ్‌గా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే వీళ్లు ఎంత ఫాస్ట్‌గా ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొచ్చారో అంతే ఫాస్ట్‌గా అది సైడ్ ట్రాక్ లోకి కూడా వెళ్లిపోయింది. ఎందుకు ఈ ప్రాజెక్ట్ సైడ్‌కి వెళ్లిపోయిందంటే... అనేక కారణాలు.
 
కథ సరిగా లేదని.. డైరెక్టర్ చెప్పింది వినాయక్‌కి నచ్చడం లేదని... ఇప్పటి వరకు షూట్ చేసిన రష్ చూసుకుంటే సరిగా రాలేదని... ఇలా చాలా కారణాలు వున్నాయి కానీ... అసలు ఈ సినిమా ఉందా..? లేదా..? అనేది మాత్రం అఫిషియల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే.. క్లారిటీ లేని ఈ సినిమా గురించి శీనయ్య అదేనండి వినాయక్ స్పందించాడు.
 
ఇంతకీ ఏమన్నాడంటే... శీనయ్య సినిమా వస్తుందా అని అడిగితే... ఏమో ఎవడికి తెలుసంటూ సెటైరిక్‌గా సమాధానమిచ్చాడు వినాయక్. తను కేవలం బరువు తగ్గడం కోసమే ఆ సినిమా ఒప్పుకున్నానని.. తనకు మాత్రం తృప్తిగా ఉందన్నాడు. ఈ విధంగా శీనయ్య సినిమా రాదనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లాప్ డైరెక్టర్స్‌తో చిరు అల్లుడు