Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండోనేషియన్ చిత్రం శూన్యం చాప్టర్1 లో హీరో విశ్వ కార్తికేయ

Vishwa Karthikeya,   Ayushi Patel
, సోమవారం, 1 జనవరి 2024 (16:40 IST)
Vishwa Karthikeya, Ayushi Patel
మన టాలీవుడ్ హీరో ఓ ఇండోనేషియన్ ప్రాజెక్టులో నటించబోతున్నారు. టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా దూసుకుపోతోన్న విశ్వ కార్తికేయ, కలియుగం పట్టణంలో సినిమాతో హిరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఆయుషీ పటేల్ హీరో హీరోయిన్లు గా ఇండోనేషియన్ ప్రాజెక్టులో నటిస్తున్నారు.
 
టాలీవుడ్‌లో దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా విశ్వ కార్తికేయ నటించారు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మంది సినిమాల్లో విశ్వ కనిపించాడు. రాజ శేఖర్ గోరింటాకు, రోహిత్ జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, శ్రీకాంత్ లేత మనసులు, మోహన్ బాబు శివ శంకర్, బాలయ్య బాబు అధినాయకుడు వంటి సినిమాల్లో విశ్వ నటించాడు.
 
జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో మంచి నటనను కనబరిచిన విశ్వ కార్తికేయ ప్రస్తుతం కలియుగం పట్టణంలో - సీకే గౌస్ మోదిన్ అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వ కార్తికేయకు జోడిగా ఆయుషి పటేల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే ఇండోనేషియన్ ప్రాజెక్ట్‌లో వీరు ఇద్దరు ఆఫర్ పట్టేశారు.
 
‘శూన్యం చాప్టర్ 1’ అంటూ రాబోతోన్న ఈ మూవీలో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి దర్శక, నిర్మాణ బాధ్యతలను సీకే గౌస్ మోదిన్ నిర్వర్తిస్తున్నారు. ఉన్ని రవి (యూఎస్ఏ) కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో ఈ సినిమా రానుంది. ఇక ఈ ఇండోనేషియన్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జర్నీ రీ రిలీజ్