Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాల్‌పై నిర్మాతల మండలి ఫైర్.. బోండాలు, బజ్జీలు తెప్పించుకుని తింటూ..?

తమిళ హీరో విశాల్‌పై నిర్మాతల మండలి మండిపడుతున్నాయి. నడిగర్ సంఘం ఎన్నికల గెలుపు తర్వాత నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అసలు విషయం ఏంటంటే.. నిర్మాతల బాగోగులు చూడాల్సిన నిర్మాతల మండలి

Advertiesment
Vishal
, గురువారం, 18 ఆగస్టు 2016 (13:15 IST)
తమిళ హీరో విశాల్‌పై నిర్మాతల మండలి మండిపడుతున్నాయి. నడిగర్ సంఘం ఎన్నికల గెలుపు తర్వాత నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అసలు విషయం ఏంటంటే.. నిర్మాతల బాగోగులు చూడాల్సిన నిర్మాతల మండలి దానిపై చర్చించకుండా బోండాలూ బజ్జీలు తెప్పించుకుని కాలం వెల్లబుచ్చుతున్నారని ఘాటు వాఖ్యలు చేశాడు.
 
అలాగే ఇటువంటి వారంతా వెళ్ళిపోయి ఆ స్థానంలో కొత్త వాళ్ళు వస్తేనే నిర్మాతలకు అలాగే చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందని ఘాటు వ్యాఖ్యలు చేసాడు.  దీంతో నిర్మాతల మండలి విశాల్‌పై ఫైర్ అయ్యింది. పైరసీ విషయాన్ని కూడా వారు సీరియస్‌గా పట్టించుకోవడం లేదని... ఇది నిర్మాతలకే కాదు నటీనటులు, సాంకేతిక నిపుణుల కెరీర్లపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపాడు. ఒక సినిమా విడుదలైన 15 రోజుల తరువాతే డీవీడీలు మార్కెట్లోకి వచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలని విశాల్ ఉచిత సలహాలిచ్చాడు. 
 
విశాల్ చేసిన వ్యాఖ్యలపై నిర్మాతలు భగ్గుమంటున్నారు. విశాల్ క్షమాపణలు చెప్పి తీరాలంటూ పట్టుబడుతోంది, లేదంటే... భవిష్యత్తులో అతడి సినిమాల విడుదల విషయంలో పంపిణీదారులు సహకరించరని హెచ్చరిచ్చింది. తను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిర్మాతల మండలి అధ్యక్షుడు కబాలీ నిర్మాత కలైపులి థాను హెచ్చరించారు. కానీ, విశాల్ మాత్రం ఆవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''ప్రేమమ్'' ఎవరే సాంగ్ రిలీజ్.. నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్.. (వీడియో)