Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ జీవితానికి ఆయన పొగడ్త చాలు.. : కంగనా రనౌత్

Kangana Ranaut
, శుక్రవారం, 19 మే 2023 (14:34 IST)
ఈ జీవితానికి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు, పొగడ్తలు చాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. తన జీవితానికి అది చాలన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. 'ఎమర్జెన్సీ' సినిమా ఎడిటింగ్ పూర్తయిందని, ఆ చిత్రాన్ని చూసిన తొలి వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ అని ఆమె తెలిపారు. 
 
'సినిమా చూస్తూ విజయేంద్ర ప్రసాద్ పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. సినిమా పూర్తయ్యాక 'నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అన్నారు. నా గురువు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో ఎమర్జెన్సీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌కు చేరుకుంది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం' అని ఆ పోస్ట్‌లో కంగనా రనౌత్ పేర్కొన్నారు. 
 
విజయేంద్ర ప్రసాద్ గతంలో కథ అందించిన 'మణికర్ణిక' సినిమాలో కంగన ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది 'ఎమర్జెన్సీ'. భారత రాజకీయ చరిత్రలో ఓ ప్రధాన ఘట్టమైన ఎమర్జెన్సీ రోజుల నాటి ఆసక్తికర కథాంశంతో రూపొందింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను కంగనా పోషించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిచ్చగాడు బెటరా! బిచ్చగాడు 2 బెటరా! రివ్యూ రిపోర్ట్‌