Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"మహర్షి" చిత్రాన్ని తిలకించిన ఉపరాష్ట్రపతి ఫ్యామిలీ... మహేశ్ బాబుకు కితాబు

, బుధవారం, 15 మే 2019 (10:11 IST)
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం "మహర్షి". ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలై ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పైగా, మంచి టాక్‌తో ప్రదర్శితమవుతూ ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందుతోంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో తిలకించారు. 
 
ఆ తర్వాత ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "తాను 'మహర్షి' సినిమాను కుటుంబ సభ్యులతో కలసి చూశానని, సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో మహేశ్ బాబు నటన ఎంతో సహజంగా ఉంది. మహేశ్ చక్కని నటన కనబరిచారు. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను ఈ సినిమా గుర్తుకు తెచ్చిందంటూ పోస్ట్ చేశారు. 
 
"గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం 'మహర్షి'. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేశ్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను" అని అన్నారు. 
 
"కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు 'మహర్షి' చిత్రాన్ని చూడటం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా" అని అన్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోగా వి.వి.వినాయ‌క్.. ఇది నిజంగా నిజం..!