Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

అజ్ఞాతవాసిలో కీర్త‌న పెడితే వర్కవుట్ కాలేదు... మ‌రి 'అరవింద సమేత'లో...?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్... యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డం.. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డం తెలిసిందే. ఇద

Advertiesment
Trivikram Srinivas
, సోమవారం, 28 మే 2018 (19:05 IST)
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్... యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డం.. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డం తెలిసిందే. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే... అందులో ఓ శాస్త్రీయ కీర్తన ఉంటుంది. సందర్భానికి తగ్గట్టుగా దాన్ని వాడుకుంటారాయన. 'అజ్ఞాతవాసి' చిత్రంలో "మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా" అన్న పాట వినిపిస్తుంది. ఇక ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... అటువంటి కీర్తన ఏదీ తన తాజా చిత్రం అర‌వింద‌ సమేతలో ఉండదని స్పష్టం చేశారు.
 
'అజ్ఞాతవాసి'లో అటువంటి పాట పెడితే వర్కవుట్ కాలేదని గుర్తు చేస్తూ, అటువంటి పాట కొత్త సినిమా స్క్రిప్టులో లేదని చెప్పారు. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోయే వ్యక్తిని తాను కానని, విజయం సాధించినా, సినిమా పోయినా మామూలుగానే ఉంటానని చెప్పారు. అపజయం ఎదురైనప్పుడు మరింతగా పనిచేస్తే బయటపడవచ్చని, తానిప్పుడు అదే పని చేస్తున్నానని అన్నారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ నెలలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన ఒంగోలు పేరు నిలబెట్టాలని మాదాల నాతో అన్నారు: మెగాస్టార్ చిరంజీవి