నట్టి కుమార్ యూజ్లెస్ ఫెలో... నయీం ఎవడు? సి. కళ్యాణ్ ఫైర్
నయీంతో సంబంధాలున్నట్లు తన దగ్గర ఆధాలున్నాయనీ.. తను కూడా బాధితుడేనని.. ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మంగళవారం నాడు ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పడంతో.. ఇండస్ట్రీలోని పెద్దల్లో కదలిక వచ్చింది. వారంతా ఛాంబర్లో బుధవారం నాడు సమావేశమై హాట్హాట్గా చర్చ సాగిం
నయీంతో సంబంధాలున్నట్లు తన దగ్గర ఆధాలున్నాయనీ.. తను కూడా బాధితుడేనని.. ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మంగళవారం నాడు ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పడంతో.. ఇండస్ట్రీలోని పెద్దల్లో కదలిక వచ్చింది. వారంతా ఛాంబర్లో బుధవారం నాడు సమావేశమై హాట్హాట్గా చర్చ సాగించారు. అరుపులు కేకలతో గట్టిగా ఛాంబర్ కార్యాలయం దద్దరిల్లింది. అక్కడకు మీడియా వస్తుందనే ఊహించనివారికి హఠాత్పరిణామం సంభవించిది. అక్కడ విషయాలు బయటకు పొక్కేశాయి.
వారంతా ముందుగా మీడియాపై విరుచుకుపడ్డారు. మీడియా నిజానిజాలు తెలుసుకోకుండా.. ఎవరుపడితేవారు చెప్పింది రాసేయడం.. టెలికాస్ట్ చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై... ఛాంబర్ కార్యాలయంలో అశోక్ కుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, బూరుగుపల్లి శివరామకృష్ణ, దాదామోదర ప్రసాద్, బెల్లంకొండ సురేష్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
నయీం ఎవరో తెలీదు : సి.కళ్యాణ్
ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షునిగా హోదాలో వున్న సి.కళ్యాణ్కు ఫోన్ చేసి నట్టికుమార్ స్టేట్మెంట్పై వివరణ కోరామని మాజీ ఛాంబర్ అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ తెలియజేస్తూ... 'యూజ్లెస్ ఫెలో'కు సంజాయిషీ ఇవ్వాల్సిన పనిలేదని కళ్యాణ్ చెప్పారని వివరించారు.
పరువు నష్టం కేసు వేస్తా: అశోక్కుమార్
ఛాంబర్ కార్యవర్గ సభ్యుడు.. సీనియర్ నిర్మాత అశోక్ కుమార్ ఈ విషయమై విరుచుకుపడ్డారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసి.. పరువు తీస్తున్న నట్టికుమార్పై పరువునష్టం కేసు వేస్తానని హెచ్చరించారు. అయినా దేనికైనా సిద్ధమేనంటూ నట్టి కుమార్ చెప్పడం విశేషం.
కాగా, గతంలో కె.సి.శేఖర్బాబు అనే వ్యక్తి.. ఛాంబర్ డబ్బులు ఎఫ్ఎన్సిసి డబ్బులు నొక్కేశాడనీ.. ఆడిట్లో కొన్ని లక్షలు తారుమారాయ్యని నట్టి కుమార్ మీడియా ముందుకు వచ్చాడు. ఈ విషయమై.. ఛాంబర్ హుటాహుటిన సమావేశమై దాన్ని రెక్టిఫై చేస్తున్నట్లు ప్రకటించింది. ఫైనల్గా నయీం ఎవరో తమకు తెలీదనీ ఛాంబర్లో మీటింగ్కు పాల్గొన్నవారంతా తెలియజేయడం విశేషం.