Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్‌పై శ్రీశీల దృష్టి.. రణబీర్ కపూర్ సరసన...

srileela
, ఆదివారం, 6 ఆగస్టు 2023 (12:53 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు 'పెళ్లి సందడి'తో పరిచయమైన కథానాయిక శ్రీలీల. ఒక్క సినిమాతోనే వంద చిత్రాల మైలేజీ దక్కించుకొంది. చక చక ఎదిగింది. ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. తెలుగులో అత్యంత బిజీగా ఉన్న కథానాయిక ఎవరంటే శ్రీలీల పేరే చెప్పాలి ఎవరైనా. ఒక్కో సినిమాకీ కోటిన్నర పారితోషికం అందుకొంటోంది. 'పుష్ప 2' లో ఐటెమ్ గీతంలో నర్తించే అవకాశం అందుకొందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆటు చిత్రబృందం కానీ, ఇటు శ్రీలీలగానీ అధికారికంగా స్పందించలేదు.
 
తాజా సమాచారం ఏమింటంటే... శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించే భారీ చిత్రంలో కథానాయికగా శ్రీలీలని ఎంచుకొన్నారని తెలుస్తోంది. రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటించే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ప్రస్తుతం శ్రీలీల కాల్షీట్లు ఖాళీగా లేవు. ఈ యేడాదంతా బిజీనే. తెలుగు సినిమాల్ని పక్కన పెట్టి బాలీవుడ్ ప్రాజెక్టు ఒప్పుకోవాలి. మరి.. శ్రీలీలకు అది సాధ్యమయ్యే పనేనా? 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతనితో డేటింగ్ చేయాల్సిన ఖర్మ పట్టలేదు : సుశ్మితా సేన్