Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Breaking News, డ్రగ్స్ కేసులో డిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్

Breaking News, డ్రగ్స్ కేసులో డిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్
, గురువారం, 17 సెప్టెంబరు 2020 (13:17 IST)
డ్రగ్స్ కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది నటి రకుల్ ప్రీత్ సింగ్. మీడియాలో తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది.
 
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, తన పేరు, సారా అలీఖాన్ పేరును ప్రస్తావించిందన్న విషయం తనకు ఒక షూట్ సమయంలో తెలిసిందని, అదే సమయంలో మీడియా నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించిందని ఢిల్లీ హైకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొంది రకుల్ ప్రీత్ సింగ్.
 
రియా తను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఉపసంహరించుకున్నారని తెలిసి కూడా వ్యతిరేక వార్తలతో మీడియా నన్ను ఇబ్బందులకు గురిచేస్తుందని, మీడియా నన్ను వేధించడానికి, మాదకద్రవ్యాల ముఠాతో నాకు సంబంధాలు అంటకట్టడానికి, నా మార్ఫింగ్ చిత్రాలను చూపిస్తున్నారని రకుల్ ప్రీత్ సింగ్ పిటీషన్లో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంచల్‌గూడ జైలుకు ఆర్ఎక్స్100 మూవీ నిర్మాత