Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్లాక్ బోర్డ్ అంటూ అపహాస్యం.. దర్శకులకు కమిట్‏మెంట్స్ ఇస్తున్నానట!?

బ్లాక్ బోర్డ్ అంటూ అపహాస్యం.. దర్శకులకు కమిట్‏మెంట్స్ ఇస్తున్నానట!?
, శుక్రవారం, 2 జులై 2021 (22:19 IST)
Shruti Das
బెంగాలీ బుల్లితెర నటి శ్రుతి దాస్ (25) పోలీసులను ఆశ్రయించారు. తన శరీర రంగును(స్కిన్ టోన్) అపహాస్యం చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని ఆమె వాపోయారు. గత రెండేళ్లుగా తాను ఈ వేధింపులను భరిస్తున్నానని, కానీ ఇటీవల మితిమిరిన స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండడంతో కోల్ కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శ్రుతి దాస్ వెల్లడించారు.
 
సోషల్ మీడియా ట్రోలింగ్ ను పట్టించుకోవద్దని తనకు చాలామంది సూచించారని, ఆ విధంగానే ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని తెలిపారు. తన మొట్టమొదటి టీవీ సీరియల్ త్రినయని దర్శకుడితో ప్రేమలో ఉన్నానని, ఈ విషయం వెల్లడి కావడంతో సోషల్ మీడియాలో వేధింపులు అధికం అయ్యాయని శ్రుతి వాపోయారు. తన వ్యక్తిత్వాన్ని, తన ప్రతిభను కించపరిచేలా కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్స్‏లో అవకాశాల కోసం దర్శకులకు కమిట్‏మెంట్స్ ఇస్తున్నానని.. అందుకే తనకు ఛాన్సులు వస్తున్నాయని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారని నటి శ్రుతి వాపోయారు.
 
కాగా, ఈ-మెయిల్ ద్వారా బెంగాలీ నటి శ్రుతి దాస్ ఫిర్యాదును స్వీకరించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఆమె.. 'దశేర్‌ మాతీ' అనే సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో శృతితో పాటు పాయల్‌ దే, రుక్మా రే అనే మరో ఇద్దరు నటీమణులు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మేని ఛాయతో శృతి స్కిన్‌ కలర్‌ను పోలుస్తూ ఈ విధంగా ట్రోల్స్‌ తో రెచ్చిపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేజీఎఫ్ స్టార్ యష్ గృహప్రవేశం.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్