Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Narasimha Bodasu  Monica Samattar  Tanniru Vasavi

డీవీ

, మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (18:37 IST)
Narasimha Bodasu Monica Samattar Tanniru Vasavi
శ్రీ శౌర్య క్రియేషన్స్ తొలిగా  'తిండిబోతు దెయ్యం' అనే చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది.  నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో నరసింహ బోదాసు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మంగళవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ముహూర్తపు సన్నివేశానికి సూపర్ హిట్ కామెడీ చిత్రాల  దర్శకులు, నంది అవార్డు గ్రహీత  రేలంగి నరసింహారావు క్లాప్ నివ్వగా.. నిర్మాత శిరీష నరసింహ బోదాసు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
 
ప్రఖ్యాత దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... కామెడీ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అంశమే. చలనచిత్ర సీమలో  కామెడీకి తిరుగులేదు. ఉండదుకూడా. అయితే.. దీనిని చక్కగా డీల్ చేసి తీస్తే విజయభావుటా ఖాయం. కామెడీ టచ్ తో కూడిన చిత్రానికి హర్రర్ మిళితం చేస్తే.. ఇక చెప్పేదేముంటుంది? ప్రేక్షకుల మనసులను ఇట్టే దోచేయొచ్చు. ఇప్పుడు సినిమాల్లో నడుస్తున్న ట్రెండ్ కూడా  ఇదే. నాకు తెలిసి దర్శకులు  నరసింహ బోదాసు ఈ చిత్రానికి ఎంతో మంచి స్క్రిప్ట్ ను సమకూర్చుకుని ఉంటారు. కామెడీతో కూడిన హర్రర్ అంటున్నారు కాబట్టి ప్రేక్షకుల మనసులను గెలుచుకునే విధంగానే ఉంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే నరసింహ బోదాసు అందులో నేర్పరి. ఎలాంటి చిత్రాలకు ప్రేక్షకాదరణ ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. అలాగే ఈ చిత్రానికి కథానాయికలు కూడా చక్కగా కుదిరారు. హీరోయిన్స్ ను చూస్తూంటే ముచ్చెటేస్తుంది. ఈ సినిమా వంద శాతం హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. ముఖ్యంగా ఏ సినిమాకైనా ప్లానింగ్ ఎంతో అవసరం. ఈ సినిమాలో  నరసింహ బోదాసు కు తోడు నందుటి అశోక్ గౌడ్  ఉన్నారు కాబట్టి చక్కటి  ప్లానింగ్ తోనే ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని ఆశిస్తున్నాను. విడుదలకు ముందు సినిమాకు మంచి ప్రమోషన్ ఇచ్చుకుంటూ ..సోషల్ మీడియాను బాగా వాడుకుని ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఈ 'తిండిబోతు దెయ్యం' కనిపించాలని... వినిపించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది  బెస్ట్ చెప్పారు. 
 
నిర్మాత, దర్శకులు, హీరో 'నరసింహ బోదాసు' మాట్లాడుతూ.. కొన్ని ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని మంచి చిత్రాలు నిర్మించాలని ఈ నూతన చిత్రనిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ ను స్థాపించాం. ప్రొడక్షన్ నెం.1గా మా 'తిండిబోతు దెయ్యం' ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఈ సినిమాలో కొత్తదనం ఉంటుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. 
 
కథానాయికలు మౌనిక, వాసవి మాట్లాడుతూ.. ఈ కామెడీ.. హర్రర్ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తమ పాత్రలను చక్కగా పోషించి అందరి అభిమానాన్ని చాటుకుంటామని, ఈ సినిమా గొప్ప సక్సెస్ కావాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో చేరిన సమంత రూత్ ప్రభు