Mammootty, Rahul Sadashivan
ఇటీవల ప్రకటించిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో నాలుగు విభాగాల్లో సత్తా చాటిన భ్రమయుగం చిత్రం, మరో అరుదైన ఘనతను సాధించింది. లాస్ ఏంజెల్స్లోని 'అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్'లో 'భ్రమయుగం' ప్రత్యేక ప్రదర్శనకు సిద్ధమైంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వం వహించారు.
ఈ ప్రదర్శన ఫిబ్రవరి 12, 2026న అకాడమీ మ్యూజియం యొక్క "వేర్ ది ఫారెస్ట్ మీట్స్ ది సీ: ఫోక్లోర్ ఫ్రమ్ ఎరౌండ్ ది వరల్డ్"(Where the Forest Meets the Sea: Folklore from Around the World) చిత్రోత్సవ శ్రేణిలో భాగంగా జరుగనుంది. ఈ కార్యక్రమం జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు కొనసాగుతుంది.
రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వం వహించిన 'భ్రమయుగం' చిత్రం, కేరళ జానపద కథల చీకటి యుగాల నేపథ్యంలో భయం, శక్తి మరియు మానవ బలహీనతలను ఆవిష్కరించిన గాఢమైన అన్వేషణ. ఈ చిత్రం బ్లాక్ & వైట్ ఫార్మాట్లో తెరకెక్కించబడింది. కట్టిపడేసే కథాకథనాలు, అద్భుతమైన సాంకేతికతతో ఈ చిత్రం విశేష ప్రశంసలు అందుకుంది.
'భ్రమయుగం' చిత్రంలో కొడుమోన్ పోట్టి అనే పాత్రలో లెజెండరీ నటుడు మమ్ముట్టి అద్భుతమైన నటన కనబరిచారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: షెహనాద్ జలాల్ (ISC), సంగీతం: క్రిస్టో జేవియర్, కళా దర్శకత్వం: జోతిష్ శంకర్, కూర్పు: షఫీక్ మొహమ్మద్ అలీ, సౌండ్ డిజైన్: జయదేవన్ చక్కదత్, సౌండ్ మిక్స్: ఎం.ఆర్. రాజకృష్ణన్, సంభాషణలు: టి.డి. రామకృష్ణన్, మేకప్: రోనెక్స్ జావియర్ & జార్జ్ ఎస్., ప్రోస్తేటిక్స్: ప్రీతిషీల్ సింగ్ డిసౌజా, దుస్తులు: మెల్వీ జె.