Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స‌ర్కారువారు పాట‌లో మ‌హేష్ డైలాగ్‌లు మైన‌స్ అయ్య‌యా!

Mahesh Babu
, శుక్రవారం, 13 మే 2022 (19:16 IST)
మహేష్ బాబు న‌టించిన‌ సర్కారు వారి పాట సినిమా ట్రైలర్‌లో ప‌లికిన కొన్ని డైలాగ్‌ల‌కు ఇప్పుడు మైన‌స్‌గా మారింద‌నే నెటిజ‌న్లు తెలియజేస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల‌రోజు పాజిటివ్ టాక్‌తో అంద‌రూ పొగిడినా రానురాను అది స‌న్న‌గిల్లింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫుల్‌గా ఉంది, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీకి జ‌నాలు తెగ చూసేస్తార‌ని రిలీజ్‌కుముందు మ‌హేష్ ప‌లికిన ప‌లుకుల‌ను అభిమానులే ప‌ట్టించుకోవ‌డంలేదు. అందుకు కార‌ణం ఈ సినిమాకు రాజ‌కీయ‌రంగు పుల‌మ‌డ‌మే.
 
కృష్ణ కుటుంబం వై.ఎస్‌.ఆర్‌.కు అనుకూలం. అది అంద‌రికీ తెలిసిందే. కానీ సినిమాలో రాజ‌కీయ డైలాగ్‌లు ప‌డ‌డంవ‌ల్ల సర్కారు వారి పాట సినిమాకు మైన‌స్ అయింద‌ని నెటిజ‌న్లు విశ్లేషిస్తున్నారు. హీరోహీరోయిన్ క‌లిసే ఓ సంద‌ర్భంలో `నేను విన్నాను. నేనున్నాను.` అంటూ వై.ఎస్‌. ప‌లికిన ప‌లుకుల‌ను మ‌హేష్‌బాబు ప‌లికాడు. దాంతో ఇది మ‌హేష్ చెప్ప‌కుండా వుండాల్సింద‌ని సోష‌ల్‌మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. అందువ‌ల్లే వైసి.పి. పార్టీ మిన‌హా మిగిలిన పార్టీల‌కు చెందిన వారెవ‌రూ ఈ సినిమాను చూడ‌డంలేద‌నీ, అందుకే పెద్ద స‌క్సెస్ కాలేక‌పోతుంద‌ని తెలియ‌జేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయన చెప్పినట్లే చేస్తే చాలు పని తేలికైపోతుంది - సోనాల్ చౌహాన్