Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాన్నకు అక్కడకు వెళ్లే టైమ్ వచ్చింది.. వెళ్లారు.. పితృవియోగంపై హీరో సుశాంత్

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో సుశాంత్‌ తన తండ్రి మరణంపై స్పందించారు. నాన్నకు అక్కడకు వెళ్లే సమయం వచ్చింది.. అందుకే అక్కడకు వెళ్లారు అంటూ సుశాంత్ అన్నారు. అక్కినేని కుటుంబంలోని నవతరం హీర

నాన్నకు అక్కడకు వెళ్లే టైమ్ వచ్చింది.. వెళ్లారు.. పితృవియోగంపై హీరో సుశాంత్
, శుక్రవారం, 19 మే 2017 (10:31 IST)
తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో సుశాంత్‌ తన తండ్రి మరణంపై స్పందించారు. నాన్నకు అక్కడకు వెళ్లే సమయం వచ్చింది.. అందుకే అక్కడకు వెళ్లారు అంటూ సుశాంత్ అన్నారు. అక్కినేని కుటుంబంలోని నవతరం హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్య భూషణ్ రావు గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన తండ్రితో అనుబంధాన్ని, ఆయనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సుశాంత్, తన సోషల్ మీడియా ద్వారా హృదయాన్ని తాకేలా స్పందించాడు. 
 
ఆయన చాలా సరదాగా ఉండేవారని, చాలా నెమ్మదైన వ్యక్తని, ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉంటారు. స్నేహితులు, కుటుంబంతో ఆయన గడిపిన మధుర జ్ఞాపకాలు తన మదినిండా ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. ఆయనకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే సమయం వచ్చిందని, అందుకే వెళ్లిపోయారంటూ పోస్ట్ చేశాడు. 
 
ఆయన జీవితంలో తామంతా భాగమైనందుకు సంతోషంగా ఉందని అంటూనే, తండ్రిని చాలా మిస్సవుతున్నానని, ఈ సమయంలో తన కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్న సన్నిహితులు, బంధువులకు ధన్యవాదాలని అన్నాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలసి చిన్నప్పుడు దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు సుశాంత్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలిని తలపిస్తున్న శ్రుతిహాసన్‌ ‘సంగమిత్ర’ ఫస్ట్‌లుక్‌