Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''తెలంగాణా కబడ్డీ జట్టు '' పాటల రికార్డింగ్ ప్రారంభం

''తెలంగాణా కబడ్డీ జట్టు '' పాటల రికార్డింగ్ ప్రారంభం
, శుక్రవారం, 3 జూన్ 2016 (16:52 IST)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఉత్సవాల సందర్భంగా తెలంగాణా నేపథ్యంలో నవ్యసాయి ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ''తెలంగాణా కబడ్డీ జట్టు'' సినిమా పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ''అనిత ఓ అనిత '' లాంటి మెలోడి పాటలతో సంచలనం సృష్టించిన రవి కళ్యాన్ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్ మొదలైంది. ఫిలిం జర్నలిస్ట్ లక్ష్మి నారాయణ రాసిన ''అరవై ఏళ్ళుగా ఎదురు చూసింది ఆకాశం - ఆనందించింది అర్ధరాత్రి తెలంగానం జయహో జయహో జై తెలంగాణా '' అనే పాటను తొలి పాటగా రికార్డ్ చేస్తున్నారు. 
 
నరసింహ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను పూర్తిగా తెలంగాణా నటీ నటులచేత తెరకెక్కించనున్నారు. తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలు, భాషా, యాసా లతో పాటు తెలంగాణా ప్రజల మధ్య ఉంటె ప్రేమాభిమానాలు ఇందులో కథ వస్తువుగా తీసుకున్నామని నిర్మాత నరసింహా రెడ్డి తెలిపారు. ఇందులో మొత్తం ఆరు పాటలు ఉంటాయన్నారు. 
 
పాటల రికార్డింగ్ పూర్తయిన తరువాత త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత చెప్పారు. కబడ్డీ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పూర్తిగా కమర్షియల్ సినిమాగా తెరకేక్కిస్తున్నమన్నారు. అన్ని జిల్లాల నుంచి నటీనటులకు, గాయనీ గాయకులకు ఈ సినిమాలో ప్రవేశం కల్పిస్తున్నామని నిర్మాత నరసింహా రెడ్డి చెప్పారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శక్వతం - ఎం ఎల్ ఎన్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్నాల్డ్‌కు చుక్కలు చూపించిన ఏనుగు.. హాలీవుడ్ హీరోకు ప్యాంటు తడిసిందా?! (వీడియో)