తమన్నా పాటకే రూ.కోటి.. 'ఒక్కడొచ్చాడు చిత్రంలో విశాల్ సరసన
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కోసం కోటి రూపాయలు ఖర్చుపెట్టేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. తాజాగా తమిళం, తెలుగు కలిపి తీస్తున్న 'ఒక్కడొచ్చాడు' అనే చిత్రంలో ఆమె విశాల్ సరసన నటిస్తోంది. సూరజ్ దర్శకత్వం వహ
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కోసం కోటి రూపాయలు ఖర్చుపెట్టేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. తాజాగా తమిళం, తెలుగు కలిపి తీస్తున్న 'ఒక్కడొచ్చాడు' అనే చిత్రంలో ఆమె విశాల్ సరసన నటిస్తోంది. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి.హరి నిర్మిస్తున్నాడు. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారిన ఆయన ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కిస్తున్నాడు.
ఇటీవలే ఫైటర్ కనల్ కన్నన్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రించారు. అవి పూర్తయ్యాక తమన్నాతో ఓ సాంగ్ చిత్రించేందుకు సెట్ను సిద్ధం చేశారు. దాదాపు ఐదు సెట్లు ఈ పాటకు వేయించారు. దీని ఖర్చే కోటి రూపాయలయింది. కొరియోగ్రాఫర్ శోబు ఆధ్వర్యంలో రూపుదిద్దుకునే ఈ పాటను త్వరలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చేనెల 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.