Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ మాటలు వైసీపీ ఉగ్రశిక్షణ ప్రభావం.. జనసేనలో చేరుతా : 'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' పృథ్వీ

Prudhvi Raj
, సోమవారం, 27 జూన్ 2022 (08:51 IST)
వైకాపా అనే ఉగ్రవాద కేంద్రంలో ఇచ్చిన శిక్షణ ప్రభావంతోనే మెగాబ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అనరాని మాటలు అన్నాని వారు సహృదయంతో క్షమించాలని తెలుగు నటుడు, థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ అన్నారు. పైగా, టీడీపీ చీఫ్ చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఇందుకోసం ఆయన కాళ్లు పట్టుకుని దండం పెట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
ఆయన ఓ తెలుగు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక అంశాలపై తన మనస్సులోని మాటలను కుండ బద్ధలుకొట్టినట్టు చెప్పేశారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌గా పని చేసిన సమయంలో తాను గొప్పవాడినన్న అహంతో పాటు గర్వం పెరిగిందన్నారు. దీంతో ఎవరినీ లెక్కచేయకుండా అనరాని మాటలు అన్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 
 
చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి వారిని అనరాని మాటలు అన్నానని, అయితే, వారు పెద్ద మనసుతో సీరియస్‌గా తీసుకోకపోగా సహృదయంతో అర్థం చేసుకున్నారన్నరు. తాను తప్పు చేశానని, మీ కాళ్లకు దండం పెడతానని చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకు చెప్పానని వెల్లడించారు. 
 
తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, జరిగిందేదో జరిగిపోయింది.. సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని వారు తనకు సూచించారని చెప్పారు. అదేసమయంలో 2024లో ఓ మంచి బస్సు ఎక్కి సపోర్ట్ చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్‌కు చెప్పగా, తప్పకుండా పిలుస్తానని, ఇప్పటికి సినిమాలు చేసుకోవాలని సలహా ఇచ్చారన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకులకు సిద్ధమవుతున్న మరో టాలీవుడ్ సెలెబ్రిటీస్