Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అభిమానులతో సెల్ఫీ తీసుకున్న సాయి ధరమ్ తేజ్

Advertiesment
supreme
, బుధవారం, 11 మే 2016 (11:05 IST)
సినిమా హీరోలతో అభిమానులు సెల్ఫీ తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. అభిమానులతో, హీరోలు సెల్ఫీ తీసుకోవడం వాటిని సోషియల్ మీడియాలో పోస్ట్ చేయడం తెలిసిన విషయమే. 'సుప్రీమ్' సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ తన అభిమానులతో సెల్ఫీ తీసుకున్నాడు. తాను జీవితంలో మర్చిపోలేని సెల్ఫీలలో ఇది కూడా ఒకటని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అన్నాడు. ఆ ఫొటోని సోషియల్ మీడియాలో పోస్ట్ చేసి తన మనసులోని మాటను ట్వీట్ చేశాడు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే మెగా హీరో  వికలాంగుల కోసం ''సుప్రీమ్'' చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వికలాంగులతో కలిసి సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా కలిసి సెల్ఫీ దిగారు. ఆ ప్రదర్శనలో పాల్గొన్న వీరిద్దరిని చూసి ఆ అభిమానులంతా ఎంతో సంతోషంగా దగ్గరకు వచ్చారు. 
 
వారందరితో కలిసి సాయి సెల్ఫీ తీసుకున్న ఫోటోను సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తనకు గుర్తుండి పోయే సెల్ఫీలలో ఇదీ ఒకటని, వారు చూపించిన ప్రేమ, అభిమానాలను తాను మరిచిపోలేనని, వారికి తన కృతఙ్ఞతలని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి - బాలయ్యల కోసమే గుండు చేయించుకున్నా : వేణు మాధవ్