Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సందీప్ కిషన్‌తో మహేష్ బాబు సోదరి సినిమా.. సాయిపల్లవి అవుట్.. అమైరా ఇన్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా ఆనందీ ఇందిరా ప్రొడక్షన్ ఎల్ఎల్‌పి పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సందీప్

సందీప్ కిషన్‌తో మహేష్ బాబు సోదరి సినిమా.. సాయిపల్లవి అవుట్.. అమైరా ఇన్
, బుధవారం, 10 మే 2017 (14:14 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా ఆనందీ ఇందిరా ప్రొడక్షన్ ఎల్ఎల్‌పి పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవి కథానాయికగా ఎంచుకోవాలనుకున్నారు.
 
కానీ ప్రస్తుతం సందీప్ సరసన త్రిధా చౌదరి, అమైరా దస్తూర్‌లు నటించనున్నారు. ఈ సినిమా ఆరంభ వేడుక ఫిలిమ్ నగర్ ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంజుల ఘట్టమనేని తెరకెక్కించే ఈ సినిమా షూటింగ్ గోవాతో పాటు లండన్‌లో జరుగుతుందని టాక్ వస్తోంది. కాగా మంజులకు ప్రిన్స్ మహేష్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖైదీకి మొగుడు కానున్న రానా.. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిలో?