Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జక్కన్న కుమారుడు ఆ రంగంలో అడుగుపెట్టబోతున్నాడట...?

జక్కన్న కుమారుడు ఆ రంగంలో అడుగుపెట్టబోతున్నాడట...?
, మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (17:16 IST)
రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టబోతున్నాడన్న వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. 'షోయింగ్ బిజినెస్' బ్యానర్‌పై కార్తికేయ చిత్రాలను నిర్మిస్తాడు. సంస్థ తొలి ప్రయత్నంగా ఆకాశవాణి అనే చిత్రాన్ని నిర్మించబోతోంది. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్‌లు రాయబోతున్నాడు. ఈ సినిమాకి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఇది అతనికి తొలి చిత్రం. కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా అదే టైటిల్‌తో తెలుగులో మరో సినిమా రాబోతోంది. దాని పేరు కూడా ఆకాశవాణి. కాకపోతే దాని పూర్తి టైటిల్ 'ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం'. సతీష్ బత్తుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మర్రిమాకల మల్లికార్జున నిర్మిస్తున్నాడు. 
 
ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల పోస్టర్ విడుదల చేశారు. వీటి వలన జనాలలో కన్ఫ్యూజన్ రావచ్చు. ఇద్దరూ ఒకే టైటిల్ ఎందుకు పెట్టుకున్నారో వారికే తెలియాలి. ఇక 'ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం' టీజర్ పోస్టర్‌ని చూసినట్లయితే, నీడలో ఒక వ్యక్తి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. 'నాకు ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటో మీకు సభాముఖంగా చెప్పబోతున్నాను' అనే క్యాప్షన్‌ని కూడా పెట్టారు. మరి అతని ప్రాబ్లమ్ ఏంటో తెలియాలంటే టీజర్ చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొడుగ్గా, సన్నగా, నల్లగా ఉన్నానని ఎగతాళి చేసేవారు.. బాలీవుడ్ బ్యూటీ