Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మెగా' మామా అల్లుళ్ల ప్రక్కన ఒకేసారి నటిస్తున్న శ్రుతి హాసన్

సినిమావాళ్ళకు సెంటిమెంట్లు చాలా కీలకం. ముహూర్తం నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ప్రతీదీ సెంటిమెంటే. అందులో హీరోహీరోయిన్లు.. సెంటిమెంట్‌ మరీను. అల్లు అర్జున్‌ అదే రూటులో వున్నాడు. తనతో కలిసి 'రేసు గుర్రం'ల

'మెగా' మామా అల్లుళ్ల ప్రక్కన ఒకేసారి నటిస్తున్న శ్రుతి హాసన్
, బుధవారం, 6 జులై 2016 (21:19 IST)
సినిమావాళ్ళకు సెంటిమెంట్లు చాలా కీలకం. ముహూర్తం నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ప్రతీదీ సెంటిమెంటే. అందులో హీరోహీరోయిన్లు.. సెంటిమెంట్‌ మరీను. అల్లు అర్జున్‌ అదే రూటులో వున్నాడు. తనతో కలిసి 'రేసు గుర్రం'లో నటించిన శ్రుతి హాసన్‌తో మరోసారి జత కట్టేందుకు సిద్ధమయ్యాడు. సరైనోడు చిత్రం తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం దిల్‌రాజు నిర్మిస్తున్నాడు.
  
 
హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో కథానాయికగా పలువురుని ప్రతిసాదించినా.. శ్రుతి హాసన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగష్టు నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, పవన్‌ కళ్యాణ్‌ కూడా శ్రుతితో తన తాజా చిత్రంలో చేయడం విశేషం. సో.. మామ అల్లుళ్ల పక్కన తను నటించడం మరింత విశేషం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచు లక్ష్మి దంపతుల 'జూనియర్ కుప్పన్న' రెస్టారెంట్ ప్రారంభం