Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమాజాన్ని చైతన్య పరిచేలా సందేశాత్మక చిత్రం : శ్వేతా బసు

హీరోయిన్ శ్వేతాబ‌సు ప్ర‌సాద్ మాట్లాడుతూ 'కొత్త బంగారులోకం', 'రైడ్', 'కాస్కో' సినిమాల త‌ర్వాత మంచి సినిమా చేస్తున్నా. ఇందులో సువ‌ర్ణ సుంద‌రి పాత్ర‌లో ఓ సెల‌బ్రిటీగా న‌టిస్తున్నా. రొమాంటిక్ సినిమా కాదిద

సమాజాన్ని చైతన్య పరిచేలా సందేశాత్మక చిత్రం : శ్వేతా బసు
, సోమవారం, 10 అక్టోబరు 2016 (08:29 IST)
హీరోయిన్ శ్వేతాబ‌సు ప్ర‌సాద్ మాట్లాడుతూ 'కొత్త బంగారులోకం', 'రైడ్', 'కాస్కో' సినిమాల త‌ర్వాత మంచి సినిమా చేస్తున్నా. ఇందులో సువ‌ర్ణ సుంద‌రి పాత్ర‌లో ఓ సెల‌బ్రిటీగా న‌టిస్తున్నా. రొమాంటిక్ సినిమా కాదిది. స‌మాజంలో మ‌నుషులు ఎలా ఉంటారు? వాళ్ల వ్య‌క్తిత్వాలు.. ఆలోచ‌నా విధానం ఎలా ఉంటుంద‌నే అంశాల‌ను హైలైట్గా క‌నిపిస్తాయి. స‌మాజాన్ని చైత‌న్య ప‌రిచే విధంగా సందేశాత్మ‌కంగా ఉంటుంది` అన్నారు. 
 
వ్య‌క్తిగ‌త విష‌యాలు చెబుతూ... చ‌దువుకుంటున్న రోజుల్లోనే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. ఆ స‌మ‌యంలోనే సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ అప్పుడు సినిమాల్ల‌ోకి వ‌స్తే చ‌దువు పాడ‌వుతుంద‌ని రాలేదు. జ‌ర్న‌లిజం మాస్ క‌మ్యూనికేష‌న్స్ చేశా. ఆపై బాలీవుడ్‌లో 'మ‌క్ దే', 'ఇక్భాల్' సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. త‌ర్వాత కొన్నాళ్ల పాటు టాలీవుడ్‌లోనూ బిజీ అయ్యా. కొంచెం గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ 'మిక్చ‌ర్ పొట్లం'తో రీఎంట్రీ ఇస్తున్నా. అలాగే బాలీవుడ్‌లో రెండు సినిమాలు ఒప్పుకున్నా. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్‌లో 'బ‌ద్రీనాథ్ కీ దుల్హానియా' సినిమా చేస్తున్నా. అటు షార్ట్ ఫిల్మ్స్‌ను సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్నా' అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'తారామణి' చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్న డి.వి.సినీ క్రియేషన్స్