Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అది తలచుకుంటే నా హార్ట్ బ్రేక్ అవుతోంది : శ్వేతా బసు

శ్వేతా బసు ప్రసాద్. బాలీవుడ్‌లో బాలనటిగా జాతీయ అవార్డు అందుకొని 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన భామ. ఆ తర్వాత వ్యభిచారం కేసులో పట్టుబడి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన భామ.

Advertiesment
అది తలచుకుంటే నా హార్ట్ బ్రేక్ అవుతోంది : శ్వేతా బసు
, శుక్రవారం, 3 నవంబరు 2017 (17:08 IST)
శ్వేతా బసు ప్రసాద్. బాలీవుడ్‌లో బాలనటిగా జాతీయ అవార్డు అందుకొని 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన భామ. ఆ తర్వాత వ్యభిచారం కేసులో పట్టుబడి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన భామ.
 
అయితే, 'కొత్త బంగారు లోకం' చిత్రంలో ఈ భామకు మంచి పేరు వచ్చినప్పటికీ.. సినీ అవకాశాలు మాత్రం రాలేదు. చివరగా తెలుగులో 'మిక్చర్ పొట్లం' అనే సినిమాలో కనిపించింది.
 
సినిమా అవకాశాలు అంతగా రాకపోవడంతో సీరియల్స్‌ వైపు మళ్లింది. ఆమె హిందీలో ‘చంద్ర నందిని’ అనే సీరియల్‌లో నటించింది. అయితే ఆ సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ గురువారమే ముగిసింది. దీంతో అమ్మడు కొంచెం బాధతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. 
 
ప్రతి ప్రయాణానికి ఒక ఎండ్ ఉంటుంది ఆ విధంగానే ‘చంద్ర నందిని’ అనే సీరియల్ కూడా ముగిసింది అంటూ.. చాలా బాధగా ఉందని, చెప్పడానికి కూడా మాటలు రావడం లేదని తెలిపింది. అంతేకాకుండా అవకాశం ఇచ్చిన నిర్మాతకు సహా నటీనటులతో పాటు ప్రొడక్షన్ టీమ్‌కి ధన్యవాదాలు అని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరోయిన్లతో పోల్చుకుంటే నా ఎక్స్‌పోజింగ్ ఎంత? రష్మీ గౌతమ్