Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెప్టెంబరు 22 నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు : చిరంజీవి

సెప్టెంబరు 22 నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు : చిరంజీవి
, మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (13:48 IST)
మెగాస్టార్ చిరంజీవి వెండితెర బాస్. ఈయన జీవితంలో రెండు తేదీలను ఎప్పటికీ మరిచిపోలేరు. ఒకటి చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీ. రెండోది నటుడిగా తన తొలి చిత్రం విడుదలైన సెప్టెంబరు 22వ తేదీ. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే కుర్రోడు 1955 ఆగ‌స్టు 22వ తేదీన జన్మించాడు. అయితే, 1978 సెప్టెంబ‌ర్ 22న సిల్వ‌ర్ స్క్రీన్‌కు న‌టుడిగా చిరంజీవిగా ప‌రిచ‌య‌మైన రోజు. 
 
ఇపుడు మెగాస్టార్‌గా అభిమానుల నీరాజ‌నాలు అందుకుంటున్న చిరంజీవి తొలి చిత్రం "ప్రాణం ఖ‌రీదు". ఈ చిత్రం విడుద‌లై నేటితో 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను మెగాస్టార్ గుర్తుచేసుకున్నారు. 
 
''నా జీవితంలో ఆగ‌స్టు 22కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో.. సెప్టెంబ‌ర్ 22కు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఆగ‌స్టు 22 నేను మ‌నిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే.. సెప్టెంబ‌ర్ 22 న‌టుడిగా 'ప్రాణం(ఖరీదు)' పోసుకున్న రోజు. నా మొద‌టి సినిమా విడుద‌లైన రోజు. నన్ను ఇంత‌గా ఆద‌రించి నన్ను ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్ష‌కులంద‌రికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణ‌మైన అభిమానులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని'' చిరంజీవి ట్వీట్ చేశారు.


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మల్టిపుల్ సెలిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నా : ఎంఎం కీరవాణి