Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Advertiesment
Jyoti Purvaj

దేవీ

, శనివారం, 19 ఏప్రియల్ 2025 (19:11 IST)
Jyoti Purvaj
“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.
 
“కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నెల 30న ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ముస్తాభవుతోంది.  ఈ సినిమాను త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)