అత్తారింటికి దారేది సినిమా ద్వారా నదియా అత్తమ్మగా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య పోటాపోటీ జరుగుతోంది. నదియాకు పోటీగా మరో హీరోయిన్ 40 ఏళ్లకే అత్త పాత్రలోకి వచ్చేస్తోంది.
ఆమె తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ భాషల్లో కూడా 22 ఏళ్ల పాటూ సినిమాలలో నటించింది. ఆమె ఎవరో కాదు.. సంఘవి.. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకుని సినిమాలకు దూరమైన ఈ భామ.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. తాజాగా తమిళంలో రెండు సినిమాలలో నటిస్తోంది.
తెలుగులో నటించేందుకు కూడా సిద్ధమేనని సంకేతాలు పంపింది. దీంతో యంగ్ హీరో రాజ్ తరుణ్కు అమ్మడు అత్తగా నటించేందుకు ఓకే చెప్పేసిందని సమాచారం. రాజ్ తరుణ్ సినిమాలో అత్తగా చేసేందుకు సంఘవితో డీల్ ఓకే అయ్యిందని సినీ యూనిట్ చెప్తోంది.