రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది "సమ్మతమే" సినిమా. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమా రిలీజై ఈ రోజుకు సరిగ్గా మూడేళ్లవుతోంది. 2022, జూన్ 24న "సమ్మతమే" ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ టీమ్ క్రేజీ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.
గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ తమ సంస్థలో ప్రొడక్షన్ నెం. 2గా కొత్త చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ రేపు ఉదయం 11.11 నిమిషాలకు చేయబోతున్నారు. ఈ సినిమా హీరో హీరోయిన్స్, ఇతర వివరాలు రేపటి ప్రకటనలో మేకర్స్ వెల్లడించనున్నారు.