Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాశ్మీరీ ఫైల్స్.. జైశ్రీరామ్‌పై సాయిపల్లవి కామెంట్స్

Saipallavi
, బుధవారం, 15 జూన్ 2022 (11:50 IST)
రానా హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం విరాటపర్వం. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో కొంతమంది ఆమె మీద విమర్శల వర్షం కురిపిస్తుంటే కొంత మంది ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.
 
కొద్ది రోజుల క్రితం కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా. ఆ సినిమాలో వాళ్ళు ఎలా చంపారు అనే విషయాలను చూపించారు. మనం వాటిని ఒక మత సంఘర్షణల లాగే చూస్తే.. ఇప్పుడు రీసెంట్‌గా బండిలో ఆవులు తీసుకు వెళుతున్నారు. 
 
బండి‌లో డ్రైవర్ ముస్లింగా ఉన్నాడు అని కొంతమంది కట్టేసి జైశ్రీరామ్ అని అనమంటున్నారు. అలా అయితే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది? మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే ఇతరులను ఇబ్బంది పెట్టము. లెఫ్టిస్ట్, రైటిస్ట్ కాదు మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు" అని ఆమె చెప్పుకొచ్చింది.
 
అయితే ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. కొంత మంది సాయి పల్లవికి చరిత్ర తెలియదు చరిత్ర తెలుసుకుని మాట్లాడమని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే సాయి పల్లవి దుర్మార్గమైన వ్యాఖ్యల నేపథ్యంలో మేము విరాటపర్వం సినిమా చూడడం లేదని ఫైర్ అవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న‌టిగా రీ ఎంట్రీకి సిద్ధం కానీ ఒక్క కండిష‌న్ అంటోన్న ఊహ‌