Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మీ గెలుపే మా పొగరు.. మా జనసేనాని' : హీరో సాయి ధరమ్ తేజ్

pawan sai

వరుణ్

, బుధవారం, 5 జూన్ 2024 (12:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో 21 స్థానాల్లో గెలుపొందింది. దీంతో పవన్ కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కొందరు సేరుగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా జనసేనానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
ఇక మంగళవారం ఎన్నికలు ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వెంట హీరో సాయి ధరమ్ తేజ్, కుమారుడు అకీరా నందన్‌ కూడా ఉన్నారు. అయితే, మంగళగిరికి చేరుకున్న తర్వాత హీరోయి సాయి ధరమ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను గట్టిగా హత్తుకుని మరోమారు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 
ఆ తర్వాత ఎత్తుకుని మరీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను హీరో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మీ గెలుపే మా పొగరు. జనసేనాని పవన్ కళ్యాణ్ నా హీరో. నా గురువు" అని పవన్‌పై ఉన్న తన ప్రమేను మరోమారు చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అభిమానులు, నెటిజన్లు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడోసారి తండ్రి అయిన హీరో.. ఎవరతను?